పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న సినిమాల్లో ఒకటి ఆదిపురుష్ (Aadipurush). మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తానాజీ ఫేం ఓం రౌత్ (Om Raut) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీని 2023 జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటూ డైరెక్టర్ ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్ కలిసి జమ్మూకశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్లారు.
ఓం రౌత్, భూషణ్ కుమార్ వైష్ణోదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి.. వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆలయ పరిసర ప్రాంతంలో దిగిన ఫొటోను షేర్ చేయగా.. నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆదిపురుష్లో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్లో బాలీవుడ్ భామ కృతిసనన్ సీత పాత్రలో నటిస్తోండగా… సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నాడు. సన్నీ సింగ్ లక్ష్మణుడిగా.. దేవ్దత్తా నగే హనుమంతుడి పాత్రలో నటిస్తున్నారు.
ఆది పురుష్ చిత్రాన్ని టీ సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ చిత్రానికి సాచెట్-పరంపర సంగీతం అందిస్తున్నారు. ప్రభాస్ మరోవైపు పాన్ ఇండియా ప్రాజెక్ట్లు సలార్, ప్రాజెక్ట్ Kతోపాటు టాలీవుడ్ హార్రర్ కామెడీ సినిమాలతో బిజీగా ఉన్నాడు.
To a Mangalkaari Shurwaat! Producer #BhushanKumar and Director #OmRaut reach Vaishno Devi to seek blessings for #Adipurush!#Adipurush releases IN THEATRES on June 16, 2023 in 3D.#Adipurush #Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar pic.twitter.com/H1zsfPJKKj
— BA Raju’s Team (@baraju_SuperHit) March 28, 2023
Read Also:
Ghantadi krishna | దర్శకుడిగా మారిన టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్.. వివరాలివే