నవతరం దర్శకరచయితల్లో దాగివున్న ప్రతిభను వెలికితీస్తూ వారిని ప్రోత్సహించేందుకు అగ్ర కథానాయకుడు పవన్కల్యాణ్ ముందుకొచ్చారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ భాగస్వామ్యంతో సృజనాత్మకతతో కూడిన నవ్యమైన సినిమాల్ని పవన్కల్యాణ్ నిర్మించబోతున్నారు. పవన్కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్.ఎల్. పి పతాకాలపై 15 చిత్రాల నిర్మాణానికి ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు. మూడు భారీ చిత్రాలు, ఆరు మధ్య తరహా చిత్రాలతో పాటు ఆరు పరిమిత చిన్న సినిమాల్ని తెరకెక్కించబోతున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘నవతరం స్వచ్ఛమైన ఆలోచనలు, కలలు కార్యరూపం దాల్చే దిశగా ఈ భాగస్వామం ఉంటుంది. కథారచయితలు, దర్శకుల ప్రతిభకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తూ మన కథల్ని బహుభాషల్లోకి తీసుకెళ్లేలా మంచి సినిమాల్ని రూపొందించబోతున్నాం’ అని తెలిపారు. ఈ సినిమాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని సంస్థ ప్రతినిధులు త్వరలో వెల్లడించనున్నారు. హరీష్పాయ్ ఈ చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేయబోతున్నారు.
ఇవి కూడా చదవండి..