రంజిత్, సిద్ధార్థ, వంశీధర్, జైసంపత్ ప్రధా పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నలుగురితో నారాయణ’. రామ్ యస్ కుమార్ దర్శకుడు. రవీందర్రావు నిర్మాణ సారథ్యంలో ఎం.డి.అస్లాం నిర్మిస్తున్నారు. ఫస్ట్లుక్ పోస్టర్ను గురువారం విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘నలుగురు అబ్బాయిలతో ఓ అమ్మాయి చేసిన ప్రయాణం ఏమిటి? వారి మధ్య చోటుచేసుకున్న సంఘటనలేమిటన్నదే చిత్ర కథ. సరికొత్త కాన్సెప్ట్తో ఆకట్టుకుంటుంది’ అన్నారు. వినోదంతో పాటు సందేశమున్న చిత్రమిదని, త్వరలో రిలీజ్ చేయబోతున్నామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: హర్ష ప్రవీణ్, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: రామ్ కుమార్ యస్.
ఇవి కూడా చదవండి..