న్యూఢిల్లీ : వీడియో కమ్యూనికేషన్స్ కంపెనీ జూమ్ లేఆఫ్స్లో (Zoom layoffs) భాగంగా ఏకంగా ప్రెసిడెంట్ గ్రెగ్ టూంబ్ను అకారణంగా విధుల నుంచి తొలగించింది. జూమ్ సీఈఓ ఎరిక్ యువాన్ కంపెనీలో 15 శాతం సిబ్బంది అంటే 1300 మంది ఉద్యోగులను సాగనంపనున్నట్టు గత నెల ప్రకటించిన నేపధ్యంలో ప్రెసిడెంట్ గ్రెగ్పై జూమ్ వేటు వేసింది.
గ్రెగ్ను ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి తొలగించినట్టు జూమ్ రెగ్యులేటరీలకు సమర్పించిన నోట్లో పేర్కొంది. గ్రెగ్ను ఎందుకు తొలగించారనే వివరణను కూడా కంపెనీ ఫైలింగ్లో పేర్కొనకపోవడం గమనార్హం. గత ఏడాది జూన్లో గ్రెగ్ను కంపెనీ హైర్ చేసుకోగా కొద్దికాలంలోనే టాప్ ఎగ్జిక్యూటివ్ను తొలగించడం కార్పొరేట్ వర్గాలను విస్మయానికి లోను చేసింది.
గ్రెగ్ ఏడాది పాటు కూడా ప్రెసిడెంట్ పదవిలో కొనసాగలేదు. గ్రెగ్ స్ధానంలో ఇప్పుడే ఎవరినీ నియమించాలని కంపెనీ భావించడం లేదని జూమ్ ప్రతినిధి పేర్కొన్నారు. గ్రెగ్ టూంబ్ 2019 ఆగస్ట్లో కంపెనీ చీఫ్ రెవెన్యూ అధికారిగా జూమ్లో చేరారు. జూమ్లో చేరకముందు గ్రెగ్ గూగుల్ సేల్స్, గూగుల్ వర్క్స్పేస్, సెక్యూరిటీ జియో ఎంటర్ప్రైజ్లో వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వహించారు.
Read More