న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావొస్తుండటంతో సిబ్బందికి ఇచ్చిన వర్క్ ఫ్రం హోం ఫెసిలిటీని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఎత్తేసింది. ఈ మేరకు తమ సిబ్బందికి గత వారం మెమో పంపినట్లు వార్తలొచ్చాయి. దీంతో 190 బిలియన్ డాలర్ల టర్నోవర్ గల ఇన్ఫోసిస్ తిరిగి ట్రాక్లోకి వచ్చేందుకు రంగం సిద్ధమైంది.
పలు ఐటీ సంస్థలు తమ సిబ్బందికి కరోనా మహమ్మారి నుంచి భద్రత కోసం వారికి సామూహిక వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాయి. మహమ్మారి ప్రభావం తగ్గి, పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకోగానే తమ సిబ్బందిని ఆఫీసులకు రావాల్సిందిగా కోరుతున్నాయి.
పలు బహుళ జాతి సంస్థల (ఎంఎన్సీ) ఉద్యోగులు తొలిరౌండ్ వ్యాక్సినేషన్ చేసుకున్నారు. మరికొన్ని సంస్థల సిబ్బంది రెండో డోస్ కూడా వేసుకున్నారు.
అతిపెద్ద ఐటీ కంపెనీలు, సంస్థలు తమ సిబ్బందిని వర్క్ ఫ్రం హోంకు అనుమతించాయి. కానీ చిన్న సంస్థలు, స్టార్టప్లు తమకు టెక్నాలజీ, రీసోర్సెస్ సరిపడా లేక ఏ విధానాన్ని అవలంభించాలో తేల్చుకోలేకపోతున్నాయి.
పలు కార్పొరేషన్లు ఒకేసారి కార్యాలయాలను తెరిచేందుకు ప్రణాళికలు వేశాయి. కానీ కరోనా రెండో వేవ్ ఉధ్రుతితో రాష్ట్ర ప్రభుత్వాలు పలు లాక్డౌన్లు ప్రకటించాయి. తత్ఫలితంగా ఆయా కంపెనీలు, సంస్థలు.. తమ ప్రణాళికలను దీర్ఘ కాలం వాయిదా వేశాయి.
వ్యాక్సినేషన్ పెరుగుతుండటంతో దేశ ప్రజల భద్రత మెరుగుపడినట్లు కనిపిస్తున్నదని ఇన్ఫోసిస్ వ్యాఖ్యానించింది. కానీ, సిబ్బందిని ఆఫీసులకు రావాలని పేర్కొంటూ జారీ చేసిన మెమోపై స్పందించలేదని సమాచారం.
‘కొందరు టీం మెంబర్లు తాము ఆఫీసులకు వచ్చి పని చేసేందుకు అనుమతించాలని కోరుతున్నారు. కొందరు ఉద్యోగులు కూడా వ్యక్తిగత ప్రాధాన్యం రీత్యా ఆఫీసుల నుంచి పని ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు ‘ అని ఇన్ఫోసిస్ తెలిపింది.
ప్రస్తుతం ఇన్ఫోసిస్ మొత్తం సిబ్బంది జూన్ నెలాఖరు నాటికి 2.67 లక్షల మందికి చేరింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అది 2.59 లక్షల మందికి పరిమితం.
గతవారం ఆర్థిక ఫలితాలు వెల్లడించిన ఇన్ఫోసిస్.. 99 శాతం మంది తమ సిబ్బంది వర్క్ ఫ్రం హోం సేవలందిస్తున్నారని తెలిసింది. వచ్చే త్రైమాసికాల్లో సిబ్బందిని ఆఫీసులకు తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామని పేర్కొంది.
దేశంలోనే నంబర్వన్ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మాత్రం సెప్టెంబర్ చివరి నాటికి తమ సిబ్బంది, కుటుంబాలకు వ్యాక్సినేషన్ పూర్తవుతుందని ఆశాభావంతో ఉంది.
‘సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉత్తమమైంది. మేం మే నెలలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ చేపట్టాం’ అని టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపినాథన్ చెప్పారు. ఇప్పటివరకు 70 శాతం మంది కంపెనీ ఉద్యోగులు పూర్తిగా లేదా పాక్షికంగా గానీ వ్యాక్సినేషన్ చేయించుకున్నారన్నారు.
విప్రో వంటి కంపెనీలు తమ సిబ్బందిని ఆఫీసులకు రమ్మని కోరే విషయమై సెప్టెంబర్ వరకు వేచి ఉంటామని ప్రకటించాయి.
Tokyo Olympics: ఆ అథ్లెట్లు నాటిన చెట్ల నుంచే ఆ ఐదు రింగులు
ఒకే వన్డేలో ఐదుగురు అరంగేట్రం.. టీమిండియా రికార్డు
Tokyo Olympics: ఓపెనింగ్ సెర్మనీ పరేడ్లో పాల్గొన్న ఇండియన్ అథ్లెట్లు
యాక్షన్ గేమ్స్ పక్కనపెట్టండి.. గూగుల్ డూడుల్తో ఒలింపిక్ గేమ్స్ ఆడతారా?
Tokyo Olympics : ఈ ఏడుగురు వనితల్లో స్వర్ణం తెచ్చేదెవరో
Tokyo Olympics: టోక్యోలో రోడ్లపై బతుకీడుస్తున్న వాళ్లను వెళ్లగొట్టిన నిర్వాహకులు
అమెజాన్-ఫ్లిప్కార్ట్కు షాక్.. సీసీఐ విచారణను అడ్డుకోలేం.. కర్ణాటక హైకోర్టు
యడియూరప్పను తొలగించేందుకు బీజేపీ హైకమాండ్ కుట్ర!
దాంపత్య రహస్యాలు లీక్ చేసేది వాళ్ళే….