న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: బెంగళూరు కేంద్రంగా ఐటీ సేవలు అందిస్తున్న విప్రోకు షాక్ తగిలింది. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న జతిన్ దలాల్ తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు.
దీంతో ఈ స్థానంలో అపర్ణ అయ్యర్ను నియమించింది సంస్థ. ఈ నియామకం వెంటనే అమలులోకి రానున్నట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది.