న్యూఢిల్లీ, డిసెంబర్ 12: ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ ఫోక్స్వ్యాగన్ కూడా ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల మాడళ్ల ధరలను 2 శాతం వరకు సవరిస్తున్నట్టు తెలిపింది.
ఉత్పత్తి వ్యయం అధికమవడంతోపాటు కమోడిటీ ఉత్పత్తులు పెరగడం వల్లనే ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం సంస్థ రూ.11.48 లక్షల నుంచి రూ.35.17 లక్షల లోపు ధర కలిగిన పలు మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్నది. మరో సంస్థ స్కోడా ఆటో ఇండియా కూడా వాహన ధరలను పెంచబోతున్నట్టు ప్రకటించింది. జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా వాహన ధరలను రెండు శాతం సవరిస్తున్నట్టు తెలిపింది.