Vivo T3x 5G : వివో భారత్ మార్కెట్లో బ్రాండ్ న్యూ స్మార్ట్ఫోన్ లాంఛ్ చేసింది. బడ్జెట్ శ్రేణిలో వివో టీ3ఎక్స్ 5జీ స్మార్ట్ఫోన్ను ప్రత్యేక ధర కింద రూ. 13,499కి ఆఫర్ చేస్తోంది. బ్యాంక్ ఆఫర్లు కలుపుకుని ఈ 5జీ స్మార్ట్ఫోన్ను రూ. 12,499కే సొంతం చేసుకోవచ్చు. వివో టీ3ఎక్స్ 5జీ ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్లో స్నాప్డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్తో కస్టమర్ల ముందుకొచ్చింది. ఈ సెగ్మెంట్లో ఇది ఫాస్టెస్ట్ ఫోన్ అని వివో వెల్లడించింది.
దేశీ మార్కెట్లో వివో టీ3ఎక్స్ 5జీని లాంఛ్ చేయడం పట్ల తాము ఎగ్జైటింగ్గా ఉన్నామని, అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ స్మార్ట్ఫోన్ యూజర్లకు మెరుగైన అనుభూతి ఇవ్వడంతో పాటు అత్యాధునిక చిప్సెట్తో వేగవంతమైన సామర్ధ్యం ఆఫర్ చేస్తుందని వివో ఇండియా ఆన్లైన్ బిజినెస్ హెడ్ పంకజ్ గాంధీ పేర్కొన్నారు.
6000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో ఈ స్మార్ట్ఫోన్ ఆకట్టుకుంటుంది. లేటెస్ట్ వివో స్మార్ట్ఫోన్ క్రిస్టల్ గ్రీన్, క్రిమ్సన్ బ్లిస్ కలర్స్లో 4జీబీ, 6జీబీ, 8జీబీ ర్యామ్తో 128జీబీ స్టోరేజ్తో మూడు వేరియంట్లలో లభిస్తుంది. వివో న్యూ స్మార్ట్ఫోన్ సేల్స్ ఏప్రిల్ 24 నుంచి ప్రారంభమవుతాయి. ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్, అన్ని పార్ట్నర్ రిటైల్ స్టోర్స్లో అందుబాటులో ఉంటుంది.
Read More :
MK Stalin | మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే.. దేశం 200 ఏళ్ల వెనక్కి వెళుతుంది : సీఎం స్టాలిన్