BOB | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: బీవోబీ దేశవ్యాప్తంగా 6 వేల ఏటీఎంలలో యూపీఐ ఆధారిత ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో బీవోబీ యూపీఐ ఏటీఎంలలో యూపీఐ ఆధారిత మొబైల్ యాప్తో డెబిట్ కార్డు లేకుండా నగదును విత్డ్రా చేసుకోవచ్చును.
యూపీఐపై కొత్త చెల్లింపు విధానాలను అందుబాటులోకి తెచ్చిన్న కొద్ది రోజుల్లో బీవోబీ ఈ నూతన సేవలను ఆరంభించడం విశేషం. ఐసీసీడబ్ల్యూ టెక్నాలజీతో కార్డు లేకుండా ఏటీఎంల్లో నగదును ఉపసంహరించుకోవచ్చునని తెలిపింది. ఈ నూతన సేవలతో ఖాతాదారుడికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని, ముఖ్యంగా యూపీఐతో అనుసంధానమై ఖాతాల్లోంచి నగదు తీయవచ్చు.