ముంబై, సెప్టెంబర్ 14: దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ మరో చారిత్రక గరిష్ఠ స్థాయి 20,103 పాయింట్లను తాకింది. చమురు అండ్ గ్యాస్, మెటల్, కమోడిటీ స్టాక్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో సూచీలు వరుసగా పదో రోజు పెరిగాయి. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 52 పాయింట్లు అందుకొని 67,519 పాయింట్లకు చేరుకోగా, నిఫ్టీ 33.10 పాయింట్లు అధికమై చారిత్రక గరిష్ఠ స్థాయి 20,103.10 వద్ద ముగిసింది. గత పది సెషన్లలో సెన్సెక్స్ 2,687.59 పాయింట్లు లేదా 4.14 శాతం పెరిగింది.
మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రా షేరు 2.56 శాతం పెరిగి టాప్ గెయినర్గా నిలిచింది. దీంతోపాటు టాటా స్టీల్, టెక్ మహీంద్రా, నెస్లె, పవర్గ్రిడ్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీ, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్అండ్టీ షేర్లు లాభాల్లో ముగిశాయి. కానీ, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, బజాజ్ ఫిన్సర్వ్, భారతీ ఎయిర్టెల్, టాటా మోటర్స్లు నష్టపోయాయి.