న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ బుధవారం తన క్యాబినెట్ను విస్తరించారు. ఊహించినట్లే రికార్డు స్థాయిలో 43 మందికి కొత్తగా అవకాశం ఇచ్చారు. ప్రధాని మోదీ రెండో సారి అధికారంలో వచ్చాక చేపట్టిన తొలి క్యాబినెట్ విస్తరణ ఇదే.
నూతన మంత్రులతో రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. తొలుత మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్ రాణే నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం ప్రారంభమైంది. చివరగా పశ్చిమ బెంగాల్కు చెందిన నిషిత్ ప్రామాణిక్తో రాష్ట్రపతి ప్రమాణం చేయించారు.
కోవిడ్ నిబంధనల మధ్య రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.
అక్కడ… సగానికి సగం తగ్గిన ఈ-వెహికల్స్ ధరలు.. ఎందుకంటే..?
హైదరాబాద్ రియల్టీలోకి వారెన్ బఫెట్
అక్కడ… సగానికి సగం తగ్గిన ఈ-వెహికల్స్ ధరలు.. ఎందుకంటే..?
మలబార్ గోల్డ్లో 5వేల ఉద్యోగాలు