హైదరాబాద్ సిటీబ్యూరో, మే 3 ( నమస్తే తెలంగాణ ): హైదరాబాద్కు చెందిన యువకుడు ఎస్కే అశ్రఫ్ 2.88 సెకన్లలో ఇంగ్లిష్ అక్షరాలు జడ్ నుంచి ఏ వరకు టైప్ చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. అశ్రఫ్ ప్రతిభను గుర్తించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బృందం ఈ ప్రక్రియను అంతా వీడియో తీసింది. ప్రస్తు తం ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు అశ్రఫ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు.