హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ ధరలు నెల రోజులకు పైగా స్థిరంగా ఉన్నాయి. చమురు ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం పలు రాష్ట్రాల్లో ధరలు తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు వినియోగం తిరిగి పుంజుకుంటున్నది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. వరుసగా మూడు రోజుల పాటు 5 శాతం, 3 శాతం చొప్పున పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఈరోజు 76 డాలర్లు దాటింది. సోమవారం బ్రెంట్ క్రూడ్ 4.6 శాతం లాభపడగా, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడ్ ఇవాళ 72 డాలర్లుదాటి 73 డాలర్ల దిశగా కనిపిస్తోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి..?
లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.95.41, చెన్నైలో రూ.101.40, కోల్కతాలో రూ.104.67, ముంబైలో రూ.109.98, హైదరాబాద్లో రూ.108.20, విశాఖపట్నంలో రూ.109.05గా ఉంది. లీటర్ డీజిల్ ఢిల్లీలో రూ.86.67, చెన్నైలో రూ.91.43, కోల్కతాలో రూ.89.79, ముంబైలో రూ.94.14, హైదరాబాద్లో రూ.94.62, విశాఖపట్నం రూ.95.18గా ఉన్నది.