Disinvestment | న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా భారీగా ఆదాయం అంచనావేసుకున్న కేంద్ర ప్రభుత్వానికి మళ్లీ నిరాశే ఎదురైంది. 2023-24 ఆర్థిక సంవత్సరం పీఎస్యూల్లో వాటాల విక్రయంతో రూ.30 వేల కోట్ల నిధులు సమకూరవచ్చునని సార్వత్రిక బడ్జెట్లో అంచనావేయగా.. దీనిని అందుకోలేకపోయింది. రూ.16,507 కోట్లు మాత్రమే సమీకరించింది.
10 సంస్థల్లో వాటాల విక్రయంతో ఈ నిధులు సమకూరాయి. వీటిలో కోల్ ఇండియాలో వాటా విక్రయిస్తే అత్యధికంగా రూ.4,186 కోట్లు వచ్చాయి. కాగా, 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాల్లో మోదీ సర్కారు డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని మించి నిధులను సేకరించింది.