హైదరాబాద్, ఆగస్టు 4: ప్రముఖ మొబైల్ సంస్థ షావోమీకి చెందిన సరికొత్త 5జీ ఫోన్ రెడ్మీ12..మొబైల్ రిటైల్ విక్రయాల్లో అగ్రగామి సంస్థల్లో ఒకటైన సెలెక్ట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ను సినీనటి పూజితతో కలిసి సెలెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళీ రేతినేని విడుదల చేశారు. ఈ సందర్భంగా మురళీ మాట్లాడుతూ..కస్టమర్లకు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ, కొత్త మాడళ్లను పరిచయం చేయడంలో సెలెక్ట్ ముందు వరుసలో ఉంటుందని, ఇదే ఒరవడిని కొనసాగిస్తూ రెడ్మీ12 5జీని ప్రవేశపెట్టినట్లు చెప్పారు.
తెలంగాణతోపాటు ఏపీ, మహారాష్ట్రల్లో ఉన్న సెలెక్ట్ షోరూంలలో ఈ ఫోన్ లభించనున్నదన్నారు. 6.79 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే కలిగిన ఈ స్మార్ట్ఫోన్లో మీడియాటెక్ హెలియో జీ88 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ ఏఐ ట్రిపుల్ బ్యాక్ కెమెరా, ముందుభాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ మాడల్ 4జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ రకాల్లో లభించనున్నది.