న్యూఢిల్లీ, జనవరి 6: మెర్సిడెజ్ బెంజ్ దేశీయ మార్కెట్లో మరింత పట్టు సాధించడానికి పావులు కదుపుతున్నది. ప్రస్తుత సంవత్సరంలో దేశీయ మార్కెట్లోకి మరో 10 కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కోటి రూపాయల ధరల శ్రేణిలో వీటిని విడుదల చేయనున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. దేశీయ మార్కెట్లోకి రూ.1.3 కోట్ల విలువైన ఏఎంజీ ఈ53 4మ్యాటిక్+ మోడల్ను ఆయన విడుదల చేశారు.