న్యూఢిల్లీ, ఆగస్టు 25: ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి దేశీయంగా 5జీ సేవలు మొదలవుతాయన్న ఆశాభావాన్ని గురువారం ఇక్కడ కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వ్యక్తం చేశారు. వచ్చే రెండు, మూడేండ్లలో దేశవ్యాప్తంగా 5జీ ఇంటర్నెట్ అందుబాటులోకి రాగలదన్న మంత్రి.. తొలి దశలో హైదరాబాద్సహా 13 నగరాల్లో ప్రారంభం కానున్నట్టు తెలిపారు.
ఈ నగరాల్లో బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ ఉన్నాయి. తొలుత నగరాలు, ఆ తర్వాత పట్టణాలు, గ్రామాల్లో 5జీ సేవల్ని వినియోగదారులకు అందించాలని టెలికం సంస్థల్ని కోరినట్టు వైష్ణవ్ చెప్పారు. అలాగే సరసమైన ధరలకే 5జీ సేవలు లభిస్తాయన్న విశ్వాసాన్ని కనబర్చారు.