న్యూఢిల్లీ, నవంబర్ 16: టెలికం దిగ్గజం రిలయన్స్ జియో వినియోగదారులను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. ఆగస్టు నెలలోనూ 32.4 లక్షల మంది కొత్త కస్టమర్లు జియో నెట్వర్క్ను ఎంచుకున్నారు. దీంతో మొత్తం సబ్స్ర్కైబర్ల సంఖ్య 44.57 కోట్లకు చేరుకున్నట్లు టెలికం నియంత్రణ మండటి ట్రాయ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
మరో టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ను 12.17 లక్షల మంది కస్టమర్లు ఎంచుకోగా..ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వొడాఫోన్ ఐడియాను మాత్రం 49,782 యూజర్లను నష్టపోయింది. ఆగస్టు చివరినాటికి ఎయిర్టెల్ కస్టమర్ల సంఖ్య 37.64 కోట్లకు చేరుకోగా, ఇదే సమయంలో వొడాఫోన్ ఐడియా వైర్లెస్ సబ్స్ర్కైబర్లు 22.82 కోట్లకు పరిమితమయ్యారు.