TCS : టెకీలకు దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ తీపికబురు అందించింది. 2025 ఆర్ధిక సంవత్సరంలో ఫ్రైషర్ హైరింగ్ పక్రియను టీసీఎస్ ప్రారంభించింది. టీసీఎస్ నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ (టీసీఎస్ ఎన్క్యూటీ)కి ఏప్రిల్ 10 వరకూ దరఖాస్తులను స్వీకరించనున్నట్టు కంపెనీ అధికారిక కెరీర్ వెబ్సైట్ వెల్లడించింది. టీసీఎస్లో ప్రైమ్, డిజిటల్, నింజా రోల్స్కు నియామక ప్రక్రియను టీసీఎస్ ఎన్క్యూటీ సరళీకరిస్తుందని కంపెనీ పేర్కొంది.
ఒకే పరీక్షతో టీసీఎస్ అసెస్మెంట్ ప్రక్రియను ప్రక్షాళన చేసింది. 2024 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్లో తగిన అభ్యర్ధులను గుర్తించేందుకు ఈ సమగ్ర విధానం సమర్ధవంతంగా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇక ఫ్రెషర్స్కు ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయనే వివరాలను ఇప్పటివరకూ టీసీఎస్ వెల్లడించలేదు. గత ఏడాది 40,000 వరకూ ఖాళీలున్నాయని టీసీఎస్ పేర్కొంది.
నింజా విభాగంలో అభ్యర్ధులకు రూ. 3.36 లక్షల వేతనం ఉంటుందని, డిజిటల్, ప్రైమ్ క్యాటగిరీ అభ్యర్ధులకు రూ. 7 లక్షల నుంచి రూ. 9-11.5 లక్షల వరకూ వేతన ప్యాకేజ్ ఉంటుందని భావిస్తున్నారు. కాగా, ఉద్యోగుల సంఖ్య కుదింపు ఆలోచన లేదని, సిబ్బంది సంఖ్యను పెంచుతామని గత నెలలో టీసీఎస్ సంకేతాలు పంపింది. నియామక ప్రక్రియను నిలువరించే ఆలోచనలు లేవని నాస్కామ్ కార్యక్రమం వేదికగా టీసీఎస్ సీఈవో కే. కృతివాసన్ ఇటీవల స్పష్టం చేశారు.
Read More :
Tripti Dimri | యానిమల్లో జోయా పాత్ర సక్సెస్కు కారణమదేనంటున్న తృప్తి డిమ్రి