TATA Takeover Air India | ఎయిర్ ఇండియా తిరిగి సొంత గూటికి చేరుకున్నది. 68 ఏండ్ల క్రితం నాటి టాటా సన్స్ అధినేత జహంగీర్ రతన్ జీ దాదాబాయ్ టాటా (జేఆర్డీ టాటా).. దేశంలో విమాన యాన సర్వీసులను ప్రారంభించారు. 1938లో విదేశాలకు విమాన సర్వీసులను విస్తరించింది. ఈ జాబితాలో కొలంబో కూడా చేరింది. తొలుత టాటా ఎయిర్ సర్వీసెస్.. తర్వాత టాటా ఎయిర్లైన్స్గా రూపాంతరం చెందింది.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బర్మాలో బ్రిటిష్ రాయల్ ఎయిర్ఫోర్స్కు మద్దతుగా విమాన సర్వీసులు కూడా నడిపింది. యుద్ధం ముగిసిన తర్వాత దాని పేరు ఇప్పటి ఎయిర్ ఇండియాగా మారింది. స్వాతంత్య్రం వచ్చాక ఎయిర్ ఇండియాలో కేంద్రం 49 శాతం వాటాను కొనుగోలు చేసింది. 1953లో దాన్ని జాతీయం చేసి టాటా సన్స్ నుంచి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం టేకోవర్ చేసింది.
ప్రస్తుతం సంస్థపై రుణ భారాన్ని పరిగణనలోకి తీసుకుని కేంద్రం వ్యూహాత్మకంగా 100 శాతం వాటాల ఉపసంహరణకు తాజాగాగా 2020లో బిడ్లను ఆహ్వానించింది. ఇందులో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 100 శాతం వాటా, ఎయిర్ ఇండియా సాట్స్ 50 శాతం వాటా ఉంది. నాలుగు సంస్థలు బిడ్లు దాఖలు చేసినా స్పైస్జెట్ సీఈవో అజయ్ సింగ్ సారధ్యంలోని కన్సార్టియం, టాటా సన్స్ పోటీ పడ్డాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Air India | ఎయిరిండియా అప్పులు రూ.60వేల కోట్ల పైచిలుకే!
Air India to TATA | ఏడాదిపాటు ఎయిరిండియా ఉద్యోగులకు నో ఉద్వాసన
వెల్కమ్ బ్యాక్, ఎయిర్ ఇండియా.. రతన్ టాటా ట్వీట్
Air India to TATA’s | టాటా చేతికే మహారాజా..