Tata Motors | న్యూఢిల్లీ, మార్చి 4: టాటా మోటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. తన బ్రాండ్ విలువను పెంచుకునే ఉద్దేశంలో భాగంగా వాణిజ్య, ప్యాసింజర్ వాహన వ్యాపారాలను వేరువేరుగా లిస్టింగ్ చేయబోతునున్నట్లు సోమవారం ప్రకటించింది. కమర్షియల్ వాహన బిజినెస్ను ఒక్క సంస్థగా ఈక్విటీ మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్న టాటా మోటర్స్…
ప్యాసింజర్ వాహన విభాగం, ఈవీ, జేఎల్ఆర్ను ఒక్కతాటిపైకి తెచ్చి మార్కెట్లో లిస్ట్ చేయబోతున్నది. ఈ సందర్భంగా టాటా మోటర్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ..గత కొన్నేండ్లుగా టాటా మోటర్స్ అంచనాలకుమించి రాణిస్తున్నదని, ఆటోమోటివ్ బిజినెస్ యూనిట్లను విడగొట్టి ప్రత్యేక సంస్థలను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.