ముంబై, మార్చి 21: కమర్షియల్ వాహన ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన టాటా మోటర్స్..తాజాగా మరోసారి తన వాహన ధరలను 5 శాతం వరకు పెంచింది. పెరిగిన ధరలు వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానున్నాయి. బీఎస్6 ఫేస్-2 ఉద్గార నిబంధనలు అమలు చేయడంలో భాగంగా ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో ఆయా కమర్షియల్ వాహన ధరలు పెరగనున్నాయి.