అహ్మదాబాద్: గుజరాత్లోని ప్రసిద్ధ సూరత్ వస్త్ర పరిశ్రమపై తాలిబన్లు దెబ్బకొట్టారు. ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకోవడంతో సూరత్కు చెందిన వందలాది టెక్స్టైల్ వ్యాపారులకు సుమారు రూ.400 కోట్లకుపైగా బకాయిలు నిలిచిపోయాయి. వీరంతా ఈ చెల్లింపుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆ బకాయిలు అందకపోతే దారుణంగా నష్టపోతామని వస్త్ర వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
సూరత్లోని సుమారు 150 మంది టెక్స్టెల్ వ్యాపారులు ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్తోపాటు పలు దేశాలకు వస్త్రాలు ఎగుమతి చేస్తుంటారు. ప్రతి ఏటా రూ.1,000 కోట్ల నుంచి రూ.1,200 కోట్ల వరకు దుస్తుల వ్యాపారం జరిగేది. జీఎస్టీ, కరోనాకు ముందు 2,500 కోట్ల మీటర్ల వస్త్రాలు మార్కెట్లో డంప్ అయ్యేవి. జీఎస్టీ అమలు, కరోనా వల్ల లాక్డౌన్ పరిణామాల నేపథ్యంలో ఇది 1,500 కోట్ల మీటర్లకు పడిపోయింది.
మరోవైపు ఆకస్మాత్తుగా తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ను స్వాధీనం చేసుకోవడంతో ఆ దేశంలోని వస్త్ర వ్యాపారులు తమ షాపులు మూసివేశారు. వ్యాపారాన్ని నిలిపివేశారు. కొందరు దేశం విడిచి వెళ్లిపోయారు. సూరత్లోని వస్త్ర పరిశ్రమపై ఇది బాగా ప్రభావం చూపింది. ఆఫ్ఘనిస్థాన్తో వస్త్ర వ్యాపారం పూర్తిగా నిలిచిపోయింది. మరోవైపు ఎగుమతి చేసిన వస్త్రాలకు సంబంధించి రూ.400 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఈ బకాయిల రాకతోపాటు వస్త్ర పరిశ్రమ భవిష్యత్తుపై సూరత్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.