న్యూఢిల్లీ/దావోస్, జనవరి 17: భారతీయ సంపన్నులలో టాప్-10 ధనవంతుల సంపదతో దేశంలోని ప్రతీ చిన్నారికి 25 ఏండ్లపాటు ఉచితంగా పాఠశాల, ఉన్నత విద్యను అందించవచ్చని ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసింది. దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక మండలి (డబ్ల్యూఈఎఫ్) ఆన్లైన్ సమావేశాల్లో తొలి రోజున ఆక్స్ఫామ్ ఇండియా తమ వార్షిక అసమానతల సర్వేను విడుదల చేసింది. కరోనా పరిస్థితుల్లోనూ భారత బిలియనీర్ల మొత్తం సంపద విలువ రెండింతలకుపైగా ఎగిసినట్టు వివరించింది. బిలియనీర్ల సంఖ్య కూడా 39 శాతం ఎగబాకి 142కు చేరిందన్నది. ఈ క్రమంలోనే వీరిలో తొలి 10 మంది కుబేరుల సంపదతోనే 25 ఏండ్లపాటు దేశంలోని ప్రతీ చిన్నారికి ఉచితంగా ప్రాథమిక, ఉన్నత విద్యను అందించవచ్చని తెలిపింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరింత ప్రగతిదాయక పన్నుల విధానాన్ని అనుసరిస్తే బాగుంటుందని సూచించింది. ఇంకా ఏం చెప్పిందంటే..