Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు భారత మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ సుమారు 570 పాయింట్లు నష్టపోయి 73,670 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా సుమారు 196 పాయింట్లు కోల్పోయి 22,320 దగ్గర కొనసాగుతోంది.
అదేవిధంగా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.44 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్-30 సూచీలో నెస్లే ఇండియా, టీసీఎస్ మాత్రమే లాభాల్లో ఉన్నాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, విప్రో, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎం అండ్ ఎం, అల్ట్రాటెక్ సిమెంట్స్, మారుతీ షేర్లు అత్యధికంగా నష్టపోతున్న జాబితాలో ఉన్నాయి.
కాగా, అమెరికా మార్కెట్లు గతవారాన్ని నష్టాలతో ముగించాయి. ఇవాళ ఆసియా ప్రధాన సూచీలు ప్రతికూలంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 90.28 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) శుక్రవారం నికరంగా రూ.8,027 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.6,341.53 కోట్ల స్టాక్స్ను కొన్నారు.