Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 306 పాయింట్లు పతనమైంది. సెన్సెక్స్ 0.55శాతం క్షీణించి 55,766 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే సమయంలో నిఫ్టీ 88.50 పాయింట్లు కోల్పోయి.. 16,631 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 12.50 పాయింట్లు క్షీణించింది. మార్కెట్లో మెటల్ ఇండెక్స్ 1.5శాతం పెరగ్గా.. ఆటో ఇండెక్స్ దాదాపు రెండుశాతం పడిపోయాయి.
సోమవారం ట్రేడింగ్లో టాటా స్టీల్ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. దాదాపు 1,465 షేర్లు లాభాల్లో ఉండగా.. 1,878 షేర్లు క్షీణించాయి. 168 షేర్లు మారలేదు. నిఫ్టీలో ఎంఅండ్ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ, ఐషర్ మోటార్స్, ఓఎన్జీసీ నష్టపోయాయి. టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా, హిందాల్కో ఇండస్ట్రీస్, అపోలో హాస్పిటల్స్ లాభపడ్డాయి.