ముంబై, ఏప్రిల్ 6: స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు కూడా లాభాల్లో ముగిశాయి. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయంతో వడ్డీరేట్లకు సంబంధించిన సూచీలు కదంతొక్కాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లు భారీగా నష్టపోయినప్పటికీ హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రిస్ షేర్ల నుంచి లభించిన మద్దతుతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 143.66 పాయింట్లు ఎగబాకి 59,832.97 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 260 పాయింట్లకు పైగా లాభపడిన సూచీ చివర్లో ఈ లాభాలను నిలుపుకోలేక పోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 42.10 పాయింట్లు పెరిగి 17,599 వద్ద నిలిచింది. బజాజ్ ఫైనాన్స్ షేరు 3 శాతం పెరిగి టాప్ గెయినర్గా నిలిచింది.