Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఇటీవల వరుస నష్టాలతో ఒడిదుడుకులను ఎదుర్కొన్న మార్కెట్లు సోమవారం లాభాల బాటలో కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలతో పాటు పెరిగిన కొనుగోళ్లతో.. సెన్సెక్స్ ప్రారంభంలోనే 500 పాయింట్లకుపైగా పెరిగింది. ముఖ్యంగా చివర సెషన్లో మార్కెట్లలో కొనుగోళ్లు కనిపించడంతో సెన్సెక్స్ 80వేల పాయింట్ల మార్క్ను దాటింది. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 79,743.87 పాయింట్ల వద్ద మొదలైంది.
ఇంట్రాడేలో 79,308.95 పాయిం కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. గరిష్ఠంగా 80,337.82 పాయింట్లకు పెరిగింది. చివరకు 445.29 పాయింట్ల నష్టంతో 80,248.08 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 142.90 పాయింట్ల లాభంతో 24,274 వద్ద ముగిసింది. నిఫ్టీలో అల్ట్రాటెక్ సిమెంట్, అపోలో హాస్పిటల్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్ అత్యధికంగా లాభపడ్డాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్, సిప్లా, ఎన్టీపీసీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్అండ్టీ నష్టపోయాయి. రియాల్టీ, ఫార్మా, మెటల్, ఆటో, మీడియా ఒకశాతం శాతం వృద్ధితో లాభాల్లో ముగిశాయి. బీబిఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు దాదాపు ఒకశాతం శాతం చొప్పున పెరిగాయి.