Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేదాలతోపాటు విదేశీ మదుపరుల కొనుగోళ్లతో సూచీలో లాభాల్లో కొనసాగాయి. ఇవాళ ఉదయం సెన్సెక్స్ 56,598 పాయింట్ల వద్ద లాభాలతో మొదలైంది. ఇంట్రాడేలో గరిష్ఠంగా 500 పాయింట్ల వరకు పెరిగిన సూచీలు.. 65,870 పాయింట్లకు చేరింది. ట్రేడింగ్ ముగిసే వరకు చివరకు 273.67 పాయింట్ల లాభంతో 65,617.84 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 83.50 పాయింట్ల లాభంతో 19,439.40 వద్ద ముగిసింది.
మంగళవారం మార్కెట్లో దాదాపు 1892 షేర్లు పురోగమించగా, 1496 షేర్లు క్షీణించాయి. 117 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో సన్ ఫార్మా, ఐషర్ మోటార్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్, మారుతీ సుజుకీలు అత్యధికంగా లాభపడ్డాయి. యూపీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ నష్టపోయాయి. మెటల్, పీఎస్యూ బ్యాంక్, ఆటో, పవర్, ఎఫ్ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, హెల్త్కేర్ ఒక్కోశాతం పెరుగడంతో అన్ని రంగాల సూచీలు గ్రీన్ మార్క్లో ముగిశాయి.