Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మూడురోజుల నష్టాల తర్వాత మంగళవారం ఉదయం లాభాలతో బెంచ్మార్క్ సూచీలు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలు.. దేశీయ మార్కెట్లపై సైతం ప్రభావం పడింది. దీంతో ఇంట్రాడేలో అదేబాటలో పయనించాయి. ఉదయం సెన్సెక్స్ 66,558.15 పాయింట్ల లాభాలతో ప్రారంభం కాగా.. ఇంట్రాడేలో 66,559.82 పాయింట్ల వరకు చేరింది. చివరకు 261.16 పాయింట్ల లాభంతో 66,428.09 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 79.75 పాయింట్లు లాభపడి 19,811.50 వద్ద ముగిసింది.
ట్రేడింగ్లో దాదాపు 2,102 షేర్లు పురోగమించగా.. 1,451 షేర్లు క్షీణించాయి. 142 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో బీపీసీఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, కోల్ ఇండియా టాప్ గెయినర్లు నిలువగా.. టాటా మోటార్స్, ఎల్అండ్టీ, యూపీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్ లూజర్స్ జాబితాలో నిలిచాయి. పవర్ ఇండెక్స్ ఒకశాతంతో గ్రీన్లో ముగియగా.. ఎఫ్ఎంసీజీ, పీఎస్యూ బ్యాంక్, మెటల్, ఆయిల్ అండ్, గ్యాస్ ఒక్కొక్కటి 0.5 శాతం పెరిగాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం లాభపడ్డాయి.