Stock markets: దేశీయ స్టాక్ మార్కెట్లపై బుధవారం బేర్ పట్టు బిగించింది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఇంకా అదే ట్రెండ్ కొనసాగిస్తున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా వెయ్యికి పైగా పాయింట్లు నష్టపోయింది. బుధవారం ఉదయం 11 గంటలప్పటికీ సెన్సెక్స్ దాదాపు 1000 కి పైగా పాయింట్లు కోల్పోయి.. 72,100 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా భారీ నష్టాల బాటలో కొనసాగుతున్నది. ఉదయం 11 గంటల సమయానికి నిఫ్టీ సుమారు 300 పాయింట్లకు పైగా కోల్పోయి.. 21,730 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయంగా నెలకొని ఉన్న ప్రతికూల పరిణామాలు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 6 శాతానికిపైగా లాస్ కావడం ఇవాళ మార్కెట్లు నష్టపోవడానికి కారణంగా తెలుస్తున్నది.