Stock Market | గత వారం నష్టాల నుంచి సోమవారం లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 631 పాయింట్లు నష్టపోయి 60,115 వద్ద ముగిసింది. నిఫ్టీ 18వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. దాదాపు 187 పాయింట్ల నష్టంతో 17,914 వద్ద ముగిసింది. దాదాపు అన్ని సూచీలు నష్టాల్లో కొనసాగగా.. బ్యాంక్, ఐటీ, మెటల్, ఫైన్సాన్స్ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఆటో, హెల్త్కేర్ స్టాక్ మాత్రమే స్వల్ప లాభాలతో ముగిశాయి.
ఇదిలా ఉండగా.. ఇవాళ ఉదయం స్టాక్ మార్కెట్ లాభాలతో మొదలయ్యాయి. సోమవారం నాటి లాభాల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగగా.. అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న అస్థిర పరిస్థితులు సూచీలను కలవరానికి గురి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో రేట్ల పెంపు విషయంలో కేంద్ర బ్యాంకులు తగ్గకపోవచ్చునన్న విశ్లేషణలు మార్కెట్లను కలవరానికి గురి చేశారు. ఫలితంగా మాంద్యం భయాలు మరింత ఎక్కువయ్యాయి. ఇవాళ ఉదయం సెన్సెక్స్ 60,805.14 వద్ద లాభాలతో ప్రారంభమై.. ఇంట్రాడేలో 59,938.38 వద్ద కష్ఠానికి చేరింది. చివరకు 631.83 పాయింట్ల నష్టంతో 60,115.48 దగ్గర ముగిసింది.
నిఫ్టీ 18,121.30 వద్ద ట్రేడింగ్ మొదలై.. ఇంట్రాడేలో 17,856.00 వద్ద కష్టానికి చేరుకొని.. చివరకు 187.05 పాయింట్ల నష్టంతో 17,914.15 పాయింట్ల వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.73 వద్ద నిలిచింది. టాటా మోటార్స్, పవర్గ్రిడ్, టాటా స్టీల్, హెచ్యూఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, ఎంఅండ్ఎం, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాలపడ్డాయి. భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, ఎన్టీపీసీ, ఐటీసీ షేర్లు నష్టపోయాయి.