Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు మంగళవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 446 పాయింట్లు, నిఫ్టీ 126 పాయింట్లకుపైగా లాభపడ్డాయి. మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంలో సూచీలు లాభాల్లో పయనించాయి. ఉదయం సెన్సెక్స్ 63,151 పాయింట్లు లాభాలతో మొదలై లాభాల్లో కొనసాగింది. చివరి గంటలో మదుపరుగులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో 63,467 పాయింట్ల గరిష్ఠానికి చేరి.. చివరకు 446.03 పాయింట్ల లాభంతో 63,416.03 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 126.20 పాయింట్లు లాభంతో 18,817.40 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్లో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ లాభపడ్డాయి. మారుతీ సుజుకీ, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్ షేర్లు నష్టపోయాయి. నిఫ్టీలో హెచ్డీఎఫ్సీ లైఫ్, అపోలో హాస్పిటల్స్, జేఎస్డబ్ల్యూ సిమెంట్, ఎస్బీఐ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ టాప్ గెయినర్స్గా నిలువగా.. సిప్లా, బ్రిటానియా, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, యూపీఎల్, అదానీ పోర్ట్స్ నష్టాల్లో ముగిశాయి.