Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో ఉదయం లాభాలతో ట్రేడింగ్ మొదలైంది. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ఒడుదొడుకులకు ఒడుదొడుకులు గురయ్యాయి. ఉదయం 66,532. 98 పాయింట్ల మొదలైన సెన్సెక్స్ తర్వాత లాభాల్లో పయనించింది. ఇంట్రాడేలో గరిష్ఠంగా 66,658.12 పాయింట్లను తాకింది. మదుపురులు లాభాల స్వీకరణకు దిగడంతో చివరకు 68.33 పాయింట్ల నష్టతో 66,459.31 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 20.25 పాయింట్ల నష్టంతో 19,733.55 వద్ద ముగిసింది. నిఫ్టీలో కోల్ ఇండియా, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎల్టీఐ అండ్ ట్రీ టాప్ గెయినర్స్గా నిలువగా.. నష్టపోయిన వాటిలో పవర్ గ్రిడ్ కార్ప్, హీరో మోటోకార్ప్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఉన్నాయి.
అయితే, ఈడీ సోదాల నేపథ్యంలో హీరో మోటోకార్ప్ నష్టపోయింది. ఉదయం వరకు లాభాల్లో హీరో మోటోకార్ప్ షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి.
అయితే, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజల్ నివాసాల్లో ఈడీ తనిఖీలు నిర్వహిస్తుందన్న వార్తల నేపథ్యంలోనే నష్టాల్లోకి వెళ్లాయి. మార్కెట్ ముగిసే సమయానికి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో షేర్ విలువ 3.24 శాతం క్షీణించి రూ.3,100 వద్ద స్థిరపడింది. కిత్రం ముగింపుతో పోలిస్తే ఒక్కో షేరు విలువ రూ.103.65 పతనమైంది. ఇక సెక్టార్లలో రియాల్టీ ఇండెక్స్ దాదాపు 2 శాతం పతనమైంది. పీఎస్యూబ్యాంక్ ఇండెక్స్ 0.5 శాతం తగ్గింది. అయితే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 1 శాతం పెరగ్గా.. మెటల్ ఇండెక్స్ 0.75 శాతం పెరిగింది. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.2 శాతం క్షీణించగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం పెరుగుదలను నమోదు చేసింది.