ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా వస్తున్న సానుకూల సంకేతాలకు తోడు, దేశీయంగా దిగ్గజ షేర్లు రాణించడం కలిసొచ్చింది. దాంతో బుధవారం నాటి ట్రేడింగ్ను మార్కెట్లు ఉత్సాహంగా మొదలుపెట్టాయి. ఆరంభంలో నిఫ్టీ 22 వేల మార్క్పైన కదలాడింది.
ఇవాళ ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 154.47 పాయింట్లు లాభపడి 72,340.56 వద్ద.. నిఫ్టీ 53.75 పాయింట్ల లాభంతో 21,983.15 వద్ద ట్రేడయ్యాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 2 పైసలు పెరిగి 83.03 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది.
నిఫ్టీలో HDFC లైఫ్, ఎస్బీఐ, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు రాణిస్తుండగా.. భారత్ పెట్రోలియం, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, విప్రో షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. డోజోన్స్ 0.4శాతం, ఎస్ అండ్ పీ సూచీ 0.2శాతం, నాస్డాక్ 0.1 శాతం మేర లాభపడ్డాయి.
జపాన్ మినహా ఆసియా-పసిఫిక్ సూచీలు ఇవాళ రాణిస్తున్నాయి. ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 0.61 శాతం, హాంకాంగ్ హాంగ్సెంగ్ 0.4 శాతం, దక్షిణ కొరియా కోస్పి 1.4 శాతం మేర లాభాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్ నిక్కీ మాత్రం 0.11 శాతం మేర కుంగింది.