Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో మొదలయ్యాయ. అంతర్జాతీయ మార్కెట్లలో వ్యతిరేక పవనాలు వీస్తున్నా.. దేశీయ సూచీలు లాభాలతో ట్రేడింగ్ మొదలైంది. అమెరికా స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. మరో వైపు చైనాలో కొవిడ్ కేసుల పెరుగుదల, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లు నష్టాల్లో నడుస్తుండగా.. బెంచ్మార్క్ సూచీలు సెన్సెక్స్ 129 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ప్రారంభమైంది.
ప్రస్తుతం సెన్సెక్స్ 301 పాయింట్లకుపైగా పెరిగి 62,804 పాయింట్లు, నిఫ్టీ 86 పాయింట్లు పెరిగి 18,649 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది. మరో వైపు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.60 వద్ద ట్రేడవుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్యూఎల్, సిప్లా, టైటాన్ కంపెనీ, హీరోమోటోకార్ప్, నెస్లే లాభాల్లో కొనసాగుతుండగా.. రిలయన్స్, బీపీసీఎల్, లార్సెన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోల్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.