Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్ 193 పాయింట్లకుపైగా పతనం కాగా.. నిఫ్టీ 18,500 పాయింట్ల దిగువన ముగిసింది. బుధవారం నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. గురువారం ఉదయం ఫ్లాట్గా మొదలయ్యాయి. సెన్సెక్స్ 62,736 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఇంట్రాడేలో 62,762 నుంచి 62,359 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. చివరకు 193.70 పాయింట్ల నష్టంతో 62,428.54 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 18,579 పాయింట్ల వద్ద మొదలవగా.. ఇంట్రాడేలో 18,580 నుంచి 18,464 మధ్య కొనసాగింది. ట్రేడింగ్ ముగిసే సరికి 46.60 పాయింట్లు క్షీణించి 18,487.80 పాయింట్ల వద్ద ముగిసింది.
ట్రేడింగ్లో 2034 షేర్లు పురోగమించగా.. 1408 షేర్లు పతనమయ్యాయి. మరో 120 షేర్లలో ఎలాంటి మార్పులు కనిపించలేదు. నిఫ్టీలో కోల్ ఇండియా, కొటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ లైఫ్ ఇన్యూరెన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్స్ టాప్ లూజర్ అత్యధికంగా నష్టపోయాయి. అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్, దివీస్ లేబొరేటరీస్, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, ఏషియన్ పేయింట్స్ లాభపడ్డాయి. రంగాల వారీగా బ్యాంక్, మెటల్ సూచీలు ఒక్కొక్కటి 0.5శాతం క్షీణించగా.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రియల్టీ, ఫార్మా రంగాల స్టాక్స్ 0.5శాతం నుంచి ఒకశాతం వరకు లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్గా ముగియగా.. స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.6శాతం పెరిగింది.