ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతోనే ప్రారంభమైనా.. చివరకు ట్రేడింగ్ నష్టాల్లోనే ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 షేర్ల సెన్సెక్స్ 303 పాయింట్లు నష్టపోయి 53,749 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 99 పాయింట్లు కోల్పోయి 16,026 వద్ద ట్రేడింగ్ ముగిసింది. అంతకు ముందు బీఎస్ఈ సెన్సెక్ 288 పాయింట్లు పెరిగి 54,340 వద్ద, నిఫ్టీ నిఫ్టీ 89 పాయింట్లు లాభపడి 16,214 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. దాదాపు 696 షేర్లు పురోగమించగా, 2548 షేర్లు క్షీణించాయి. 109 షేర్లలో ఎలాంటి మార్పులు కనిపించలేదు.
నిఫ్టీలో ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, దివీస్ ల్యాబ్స్, యూపీఎల్, టీసీఎస్ టాప్ నష్టాల్లో ఉండగా.. ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్ లాభాల్లో కొనసాగాయి. బ్యాంక్ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు ఆయిల్, గ్యాస్, మెటల్, ఫార్మా, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఐటీ ఇండెక్స్ 1 నుంచి 3 శాతం క్షీణించాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 1.9 శాతం క్షీణించగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.9 శాతం మేర నష్టపోయింది.