Stock Market | దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే వరకు 712.46 పాయింట్లు పెరిగి 57,570.25, నిఫ్టీ 228.70 పాయింట్లు పెరిగి 17,158.30 వద్ద ముగిసింది. దాదాపు 2,037 షేర్లు పెరగ్గా.. 1,197 షేర్లు క్షీణించాయి. 140 షేర్లలో ఎలాంటి మార్పు కనిపించలేదు. నిఫ్టీలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా స్టీల్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ లైఫ్, హిందాల్కో ఇండస్ట్రీస్ లాభాలను ఆర్జించగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐ, దివీస్ ల్యాబ్, యాక్సిస్ బ్యాంక్ నష్టపోయాయి.
మెటల్ ఇండెక్స్ 4 శాతానికిపైగా పెరగ్గా.. ఫార్మా, ఆటో, ఐటీ, పవర్ అండ్ ఆయిల్, గ్యాస్ ఇండెక్స్లు ఒక్కొక్కటి ఒకటి నుంచి రెండుశాతం మేర పెరిగాయి. అయితే, పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ ఒక శాతం క్షీణించింది. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ ఒక శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.38 శాతం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో పాటు మెటల్, టెక్నాలజీ రంగాల్లో కొనుగోళ్లు స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. గ్లోబల్ మార్కెట్లలో అమెరికా ఫ్యూచర్స్ సానుకూలంగా ఉండడం, యూరప్ మార్కెట్లు సైతం మెరుగ్గా ట్రేడవుతుండడం తదితర కారణాలు దేశీయ మార్కెట్లలో మదుపర్ల సెంటిమెంట్ను బలపరిచింది.