Stock Market | దేశీయ బెంచ్మార్క్ సూచీలు వరుసగా రెండోరోజైన బుధవారం నష్టాల్లోనే ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల వాతావరణం దేశీయ మార్కెట్లపై పడింది. ఉదయం సెన్సెక్స్ 465 పాయింట్ల నష్టంతో 65,047 పాయింట్ల నష్టంతో మొదలైంది. నిఫ్టీ 83.24 పాయింట్లు తగ్గి 19,397 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో స్వల్పంగా కోలుకున్న సూచీలు.. చివరకు 286.06 పాయింట్ల నష్టంతో 65,226.04 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 92.70 పాయింట్ల నష్టంతో 19,346.10 వద్ద ముగిసింది.
దాదాపు 1,255 షేర్లు పురోగమించగా.. 2,294 షేర్లు క్షీణించగా.. 122 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టపోగా.. అదానీ ఎంటర్ప్రైజెస్, నెస్లే ఇండియా, హెచ్యూఎల్, ఐషర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నష్టాల్లో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినహా.. ఆటో, క్యాపిటల్ గూడ్స్, పవర్, పీఎస్యూ బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, హెల్త్కేర్, మెటల్, రియాల్టీ 1-3 శాతం క్షీణించాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 1.5 శాతం తగ్గగా.. స్మాల్క్యాప్ ఇండెక్స్ ఒకశాతం పడిపోయింది.