Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో సూచీలు లాభాల్లో కొనసాగాయి. డాలర్ ఇండెక్స్ బలహీనపడడంతో పాటు అమెరికా బాండ్ల రాబడులు తగ్గడం సైతం కలిసివచ్చింది. ఇవాళ ఉదయం 66,376.42 పాయింట్ల వద్ద లాభాలతో మొదలై.. ఇంట్రాడేలో 66,592.16 పాయింట్ల గరిష్ఠానికి చేరింది. చివరకు 393.69 పాయింట్ల లాభంతో 66,473.05 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 121.50 పాయింట్ల లాభంతో 19,811.35 వద్ద ముగిసింది. ట్రేడింగ్లో దాదాపు 2,275 షేర్లు పురోగమించగా.. 1283 షేర్లు క్షీణించాయి. 132 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో హీరో మోటోకార్ప్, విప్రో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ అత్యధికంగా లాభపడ్డాయి. హెచ్సీఎల్ టెక్నాలజీస్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, కోల్ ఇండియా, టీసీఎస్ నష్టపోయాయి. పీఎస్యూ బ్యాంక్ మినహా, ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫార్మా, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్ రియల్టీ 0.5-1 శాతం పెరిగాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం, స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం పెరిగాయి.