Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్గా మొదలయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 62,659.98 పాయింట్లు వద్ద లాభాలతో ప్రారంభమైంది. చివరకు 99.08 పాయింట్ల లాభంతో 62,724.71 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 18,595.05 పాయింట్లతో మొదలై.. చివరకు 38.10 పాయింట్లు లాభపడి 18,601.50 దగ్గర ముగిసింది. గతవారం చివరి రెండు రోజులు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. వారంలో తొలిరైజన సోమవారం లాభాపడ్డాయి. ఇవాళ ట్రేడింగ్లో 2098 షేర్లు పురోగమించగా.. 1528 షేర్లు క్షీణించాయి.
119 షేర్లు మారలేదు. నిఫ్టీలో బీపీసీఎల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, అదానీ ఎంటర్ప్రైజెస్ లాభాల్లో కొనసాగాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, లార్సెన్ అండ్ టూబ్రో, సిప్లా, మారుతీ సుజుకీ, టైటాన్ కంపెనీలు నష్టపోయాయి. సెక్టార్లలో క్యాపిటల్ గూడ్స్ 0.5 శాతం నష్టపోగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పీఎస్యూ బ్యాంక్, మెటల్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ 0.5-1 శాతం లాభపడ్డాయి. బీబిఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున పెరిగాయి.