Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు వరుసగా రెండోరోజు నష్టాల్లోనే ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల పవనాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి. గురువారం ఉదయం సెన్సెక్స్ 457 పాయింట్ల నష్టంతో 65,419 ప్రారంభమైంది. నిఫ్టీ 128 పాయింట్లు తగ్గి 19,542 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 65,868 పాయింట్ల గరిష్ఠానికి చేరింది. చివరకు 247.78 పాయింట్ల నష్టంతో 65,629.24 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 46.40 పాయింట్లు పతనమై.. 19,624.70 పాయింట్ల వద్ద ముగిసింది.
ట్రేడింగ్లో దాదాపు 1,810 షేర్లు పురోగమించగా.. 1,759 షేర్లు పతనమయ్యాయి. 129 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో విప్రో, టెక్ మహీంద్రా, యూపీఎల్, భారతీ ఎయిర్టెల్, హిందాల్కో ఇండస్ట్రీస్ భారీగా నష్టపోగా.. బజాజ్ ఆటో, ఎల్టీఐఎండ్ట్రీ, నెస్లే ఇండియా, హీరో మోటోకార్ప్, అల్ట్రాటెక్ సిమెంట్ లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే బ్యాంక్, మెటల్, పవర్, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా 0.3-0.9 శాతం క్షీణించగా.. ఆటో ఇండెక్స్ 0.5 శాతం పెరిగింది. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి.