Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బెంచ్ మార్క్ సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. ఇంట్రాడే లో కొనుగోళ్ల అండతో కోలుకొని లాభాల్లోకి వెళ్లాయి. సెన్సెక్స్ 65,925.64 పాయింట్ల నష్టంతో ప్రారంభం కాగా.. ఇంట్రాడేలో 65,549.96 పాయింట్ల కనిష్ఠానికి.. ఆ తర్వాత 66,172.27 గరిష్ఠాన్ని అందుకున్నది. చివరకు 173.22 పాయింట్ల లాభంతో 66,118.69 వద్ద ముగిసింది. నిఫ్టీ 51.75 పాయింట్ల లాభపడి 19,716.45 దగ్గర స్థిరపడింది.
దాదాపు 1,921 షేర్లు పురోగమించగా.. 1,616 షేర్లు క్షీణించాయి. 143 షేర్లు మారలేదు. నిఫ్టీలో కోల్ ఇండియా, ఐటీసీ, లార్సెన్ అండ్ టూబ్రో, సిప్లా, ఎల్టీఐఎండ్ట్రీలు లాభపడ్డాయి. టైటాన్ కంపెనీ, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్, ఎస్బీఐ మరియు బీపీసీఎల్ నష్టపోయాయి. పీఎస్యూ బ్యాంక్, క్యాపిటల్ గుడ్స్, ఎఫ్ఎంసీజీ, రియల్టీ, హెల్త్కేర్ సూచీలు 0.5 నుంచి 1 శాతం పెరిగాశాయి. అయితే చమురు, గ్యాస్ పేర్లలో కొంత అమ్మకాలు కనిపించాయి. బీఎస్ఈలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 0.6 శాతం చొప్పున పెరిగాయి.