Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు నష్టాల్లోనే ముగిశాయి. మంగళవారం సెన్సెక్స్ 326.23 పాయింట్లు పతనమై 58,962.12 పాయింట్ల వద్ద టేడ్రింగ్ ముగిసింది. మరో వైపు నిఫ్టీ 88.75 పాయింట్ల తగ్గి.. 17,303.95 వద్ద స్థిరపడింది. మంగళవారం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో సూచీలు లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 59,299 పాయింట్ల వద్ద ఫ్లాట్గా ప్రారంభమైన సెన్సెక్స్.. ఆ తర్వాత లాభాల్లోకి వెళ్లి.. 59,483 వద్ద గరిష్ఠాన్ని తాకింది. తర్వాత అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి వెళ్లాయి. ఓ దశలో 500కు పైగా నష్టాల్లోకి జూరుకున్న సూచీ.. కాస్త కొలుకొని 326.23 పాయింట్ల నష్టంతో 58,962.12 వద్ద ముగిసింది.
సెన్సెక్స్లో ఏషియన్ పెయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డీఎఫ్సీ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, ఐటీసీ నష్టపోయాయి. నిఫ్టీలో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్, ఏషియన్ పేయింట్స్ లాభపడ్డాయి. బ్రిటానియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లాభపడగా.. సిప్లా, హిందాల్కో, రెడ్డీస్ల్యాబ్, ఏఎన్జీసీ, టాటా స్టీల్ నష్టాపోయాయి. ఇదిలా ఉండగా.. మంగళవారం ట్రేడింగ్లో అదానీ గ్రూప్ షేర్లు స్వల్పం లాభపడ్డాయి. హిండెన్బర్గ్ నివేదిక తర్వాత షేర్లు భారీగా పతనమైన విషయం తెలిసిందే. ఇవాళ్టి ట్రేడింగ్లో అదానీ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్ మినహా ఆ గ్రూప్నకు చెందిన షేర్లు లాభాల్లో ముగిశాయి.