న్యూఢిల్లీ, మే 12: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ)..ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 30 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. శుక్రవారం నుంచి అమలులోకి వచ్చేలా రూ.2 కోట్ల లోపు ఎఫ్డీలపై వడ్డీరేట్లను సవరించింది. సాధారణ డిపాజిట్లపై 7.25 శాతం వరకు వడ్డీ లభిస్తుండగా, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది బ్యాంక్.
ఏడు రోజుల నుంచి 45 రోజుల కాలపరిమితి కలిగిన ఎఫ్డీపై 3 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్న బ్యాంక్..46-180 రోజులపై 4.5 శాతం వడ్డీ, 181-210 రోజుల డిపాజిట్లపై 4.5 శాతం వడ్డీ, 211 రోజుల నుంచి ఏడాది లోపు డిపాజిట్లపై 5.75 శాతం, ఏడాది-రెండేండ్ల డిపాజిట్లపై 6.75 శాతం, రెండేండ్లు-మూడేండ్లలోపు డిపాజిట్లపై 7.05 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది.