ముంబై, మే 10: లాజిస్టిక్ టెక్నాలజీ స్టార్టప్ పిక్కర్..దేశవ్యాప్తంగా మరో 25 నూతన ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. చివరి మైల్ డెలివరీని మరింత వేగవంతంగా అందించాలనే ఉద్దేశంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్తోపాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా, గాజియాబాద్, లక్నోలలో గిడ్డంగ్లు ఉన్నాయి. నూతన గిడ్డంగ్లను ఏర్పాటు చేయనుండటంతో వినియోగదారులకు, సంస్థకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి వీలు పడనున్నదని పేర్కొంది. రవాణాకు అయ్యే ఖర్చులు తగ్గడంతోపాటు బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు తమ వస్తువును వెంటనే అందించవచ్చును.