Off line Digital Payments | దేశవ్యాప్తంగా సమీప భవిష్యత్లో ఆఫ్లైన్లో డిజిటల్ పేమెంట్స్ జరిపేందుకు అడుగులు ముందుకు పడుతున్నాయి. ఈ అంశాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రతిపాదించారు. లో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదా అసలు ఇంటర్నెట్ లేని ప్రాంతాల్లో సులువుగా డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు శుక్రవారం ఆయన చెప్పారు. ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం తర్వాత శక్తికాంతదాస్ మీడియాతో మాట్లాడారు.
మారుమూల ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ సేవలు లేని ప్రాంతాల్లోనూ, ఉన్న ప్రాంతాల్లోనూ ఆఫ్లైన్ మోడ్లో డిజిటల్ చెల్లింపులు సజావుగా నిర్వహించేందుకు ఆఫ్లైన్లో రిటైల్ డిజిటల్ చెల్లింపుల పరిష్కారాల విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా గతేడాది ఆగస్టులో ప్రకటించాం అని శక్తికాంత దాస్ చెప్పారు. గతేడాది ప్రవేశపెట్టిన పైలట్ ప్రాజెక్టు ప్రోత్సాహకరంగా ఉందన్నారు. దీని ఆధారంగా దేశవ్యాప్తంగా రిటైల్ ఆఫ్లైన్ పేమెంట్స్ ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. దీంతో తదుపరి దశకు డిజిటల్ చెల్లింపులు చేరుకుంటాయన్నారు శక్తికాంత దాస్.
ఆఫ్లైన్ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అందుబాటులోకి తేవడంతో వ్యక్తులకు, వ్యాపార సంస్థలకు కొత్త అవకాశాలు లభిస్తాయన్నారు శక్తికాంత దాస్. దేశంలోని వివిధ ప్రాంతాల్లో గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు చిన్న మొత్తాల లావాదేవీలను ఆఫ్లైన్ మోడ్లో నిర్వహించామన్నారు. 2.41 లక్షల లావాదేవీల్లో రూ.1.16 కోట్ల చెల్లింపులు జరిగాయని ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
గతేడాది సెప్టెంబర్ నుంచి చేపట్టిన ఆఫ్లైన్ డిజిటల్ పేమెంట్స్లో గరిష్ఠంగా రూ.200 వరకు ఆర్బీఐ అనుమతించింది. ఏటీఎం కార్డులు, మొబైల్ ఫోన్ల ద్వారా ఈ పేమెంట్స్కు ఆమోదం తెలిపింది. ఇందులో బ్యాంకులతోపాటు బ్యాంకింగేతర సంస్థలకు అవకాశం కల్పించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Air India | ఎయిరిండియా అప్పులు రూ.60వేల కోట్ల పైచిలుకే!
Air India to TATA | ఏడాదిపాటు ఎయిరిండియా ఉద్యోగులకు నో ఉద్వాసన
వెల్కమ్ బ్యాక్, ఎయిర్ ఇండియా.. రతన్ టాటా ట్వీట్
Air India to TATA’s | టాటా చేతికే మహారాజా..