Silver Price | న్యూఢిల్లీ, మే 17: వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వరుసగా రెండోరోజు శుక్రవారం కిలో వెండి ధర ఏకంగా రూ.89 వేల మార్క్ను అధిగమించింది. బంగారం ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ వెండి మాత్రం పరుగులు పెడుతున్నది. రికార్డు స్థాయికి చేరుకున్న ధరలు పారిశ్రామిక వర్గా లు, నాణేల తయారీదారులు గగ్గోలు పెడుతున్నారు.
వరుసగా రెండు రోజుల్లో వెండి ఏకంగా రూ.2 వేలకు పైగా ఎబాకింది. శుక్రవారం మరో రూ.300 అందుకొని రూ.89 వేలకు చేరుకున్నది. అటు బంగారం రూ. 150 తగ్గి రూ.74 వేల దిగువకు రూ. 73, 900కి పరిమితమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 2,380 డాలర్లకు పడిపోగా, వెండి 29.65 డాలర్లకు ఎగబాకింది.