న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: బంగారం, వెండి మళ్లీ పరుగులు పెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు నిలకడగా ఉన్నప్పటికీ దేశీయంగా రిటైలర్లు, స్టాకిస్టులు అధికంగా కొనుగోలు జరపడంతో ధరలు భారీగా పుంజుకున్నాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో కిలో వెండి ఏకంగా రూ.4,300 ఎగబాకి రూ.2,57,300కి చేరుకున్నది.
అంతకుముందు ఇది రూ.2.53 లక్షలుగా ఉన్నది. వెండితోపాటు బంగారం కూడా అధికమైంది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.800 అందుకొని రూ.1.57 లక్షలకు చేరుకున్నది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ వెండి 1.09 డాలర్లు లేదా 1.35 శాతం తగ్గి 79.71 డాలర్లకు పడిపోగా, బంగారం 4,805.09 డాలర్లకు చేరుకున్నది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటం, పలు దేశాల ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడంతో పసిడికి డిమాండ్ పడిపోయిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.